Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళా న్యాయమూర్తులకు న్యాయం ఎక్కడ?
posted on: Mar 10, 2025 9:30AM

చట్టం సమాజంలో, దేశంలో ప్రతి పౌరుడికి కొండంత భరోసా ఇస్తుంది. పౌరులందరికి సమన్యాయం చేసేది చట్టమే. అయితే ఆ చట్టం సరైన విధంగా ఉంటేనే ఆ సమన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో సమన్యాయం అనే మాట కాసింత చర్చలకు దారి తీస్తుంది. ముఖ్యంగా లింగ సమానత్వం అనే విషయం మీద ఎప్పుడూ సమాజంలో ఏదో ఒక చర్చ, అభిప్రాయం పుట్టుకొస్తూనే ఉంటుంది. పదుగురికి న్యాయం అందించే న్యాయ సేవ విభాగంలో మహిళలు కూడా ప్రవేశించి, న్యాయ దేవతలకు ప్రతి రూపంగా నిలుస్తున్నారు. న్యాయ సేవలో మహిళల పాత్రను, ఆవశ్యకతను గుర్తు చేస్తూ.. మహిళలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం జరుపుకుంటారు.
చట్టం గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే అది న్యాయంగా ఉండాలి. న్యాయం గుడ్డిది, పక్షపాతంతో లేనిది, అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. అయినప్పటికీ భారతదేశ న్యాయవ్యవస్థను పరిశీలిస్తే ఒక విచిత్రమైన విషయాన్ని గమనించవచ్చు. న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ అది చాలా స్పష్టంగా ఒక రూపంలో న్యాయాన్ని వ్యక్తం చేస్తుంది. న్యాయం అనగానే చాలా మందికి నల్లకోటు, టై ధరించిన లాయర్ ఏ గుర్తుకువస్తాడు. ప్రతి సంవత్సరం మార్చి 10న ప్రపంచం అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు చట్టాన్ని అర్థం చేసుకోగలరని న్యాయ సేవలో భాగం కాగలరని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ దినోత్సవాన్ని 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2022లో జరుపుకున్నారు. న్యాయవ్యవస్థలో మహిళల సహకారాన్ని గుర్తు చేసుకోవడానికి, న్యాయపరమైన పాత్రలను కొనసాగించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించడానికి దీనిని ప్రవేశపెట్టారు. ఖతార్ రాష్ట్రంలో సాంప్రదాయకంగా లింగ సమానత్వం లేదు. కానీ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశ్యంతో దినోత్సవాన్ని ఖతార్ రాష్ట్రం రూపొందించిందని అంటున్నారు.
సమన్యాయం ?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి. అపారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అయినప్పటికీ భారతదేశ హైకోర్టులలో సిట్టింగ్ జడ్జిలలో కేవలం 14% మాత్రమే మహిళలు ఉన్నారు . ఇది గత సంవత్సరాలతో పోలిస్తే (2023లో 13%, 2022లో 11%) మెరుగుదల. కానీ, సూటిగా చెప్పాలంటే, ఇది కొద్ది శాతం మాత్రమే మెరుగైనది. ప్రస్తుతం భారతదేశంలోని 754 హైకోర్టు న్యాయమూర్తులలో, కేవలం 106 మంది మహిళలు మాత్రమే ఉన్నారు . ఒక మహిళా న్యాయమూర్తి సగటు పదవీకాలం 4.5 సంవత్సరాలు . అంటే అన్ని న్యాయమూర్తుల మొత్తం సగటు కంటే ఒక సంవత్సరం తక్కువ. ఇది ఆందోళ కలిగించే అంశం . ఎందుకిలా అనే ఆలోచన వస్తే.. మహిళలకు న్యాయ విభాగంలో సరైన చోటు ఎవరూ ఇవ్వలేకపోతున్నారు.
కొన్ని హైకోర్టులు బాగానే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్ & హర్యానాలో 14 మంది మహిళా న్యాయమూర్తులు , మద్రాసులో 12 మంది, బొంబాయిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఢిల్లీలో 9 మంది ఉన్నారు, దేశ రాజధానితో పోలిస్తే ఇది తక్కువే. ఇతర ప్రాంతాలలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాలలో మహిళా న్యాయమూర్తులు లేరు. సిక్కిం, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఇతరు రాష్ట్రాలలో కేవలం ఒకరే ఉన్నారు. . జమ్మూ & కాశ్మీర్, లడఖ్ లలో ఇద్దరు.. ఇది కేవలం నెంబర్స్ లెక్కపెట్టడంలో తమాషా చూడటం లా చాలా మందికి అనిపిస్తుందేమో.. కానీ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలలో మహిళలు లేరని చెప్పడానికి నిదర్శనం. చట్టపరమైన నిర్ణయాలకు పురుషులు ఎక్కువగా బాధ్యత వహించడంలో సమస్య ఏమిటంటే, వారు ఎక్కువగా పురుషాధిక్య తీర్పులను తీసుకుంటారు. ఇది దురుద్దేశంతో కాదు కానీ అలవాటు, పక్షపాతం, చట్టపరమైన చరిత్ర అనే ఒక వాక్యాన్ని చూపి మహిళలను చిన్న సహాయక పాత్రలుగా మలిచేస్తున్నారు.
మహిళా న్యాయమూర్తులు ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారని అడిగితే అనేక రకాల నమ్మశక్యం కాని సమాధానాలు లభిస్తాయి..
మహిళలు తగినంత అర్హత కలిగి ఉండరని చాలా మంది అంటారు. కానీ చాలా లా స్కూల్స్లో మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, తరచుగా వారి తరగతిలో అగ్రస్థానంలో పట్టభద్రులవుతారు. సమస్య సామర్థ్యం కాదు అవకాశం లేకపోవడం. మహిళలకు న్యాయ విభాగంలో తగినంత అవకాశాలు ఇవ్వరు.
న్యాయమూర్తి పదవికి మహిళలు దరఖాస్తు చేయరని కొందరు అంటారు. కానీ.. మహిళలు దరఖాస్తు చేయకపోవడం నిజమేనట.. ఎందుకంటే అవి లభించవని మహిళలకు తెలుసట. న్యాయ నియామకాలను కొలీజియంలు (ముఖ్యంగా, కొత్త నియామకాలను సిఫార్సు చేసే సీనియర్ న్యాయమూర్తుల చిన్న సమూహాలు) నిర్ణయిస్తాయి. ఈ సమూహాలు చారిత్రాత్మకంగా పూర్తిగా పురుషులతో కూడుకున్నవి, అంటే వారు సహజంగానే ఎక్కువ మంది పురుషులను ప్రోత్సహించడం వైపు మొగ్గు చూపుతారు.
న్యాయవాద వృత్తికి సమయం ఎక్కువ కేటాయించాలని చెబుతారు. కానీ అది నిజం కాదు.. మహిళలు వంటగదిలో ఉండటమే మంచిది అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన చాలామందిలో ఉండిపోయింది. ఇలా మహిళలకు చాలా విధాలుగా న్యాయ విభాగంలో అడ్డుగోడలు ఉన్నాయి. మహిళలు ఈ విభాగంలో రాణించాలంటే అందరి తోడ్పాటు, ప్రోత్సాహం తప్పకుండా లభించాలి. అప్పుడే న్యాయ దేవతలాగా, మహిళా న్యాయ మూర్తులు న్యాయాన్ని త్రాసులో సమంగా తూచగలుగుతారు.
*రూపశ్రీ.






