యోగా దినోత్సవం: గిన్నిస్ రికార్డులు
Published on: Sun Jun 21, 2015 9:01PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం యోగాతో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఢిల్లీలోని రాజ్పథ్లో భారత ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన యోగా గిన్నిస్ రికార్డులలో నమోదైంది. ఏకకాలంలో ఒకేచోట 35,985 మంది యోగా చేయడం రికార్డుగా నిలిచింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా విభిన్న జాతీయులు ఒకేసారి యోగాలో పాల్గొనడం కూడా గిన్నిస్ రికార్డు అయింది.


