వైస్సార్సీపీ లో కుమ్ములాటలు

posted on: Mar 30, 2013 7:49AM

Internal Fight In YSRCP, YSRCP Internal Fight, YSRCP Internal Fight Guntur District

 

గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోకవర్గాలకు వైఎస్సార్సీపీ 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపికచేసి వారిని కోఆర్డినేటర్లుగా నియమించింది. ఈ క్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా అంబటి రాంబాబుని నియమించింది. ఈ నియోజకవర్గ నుండి టిక్కెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి, నలందా విద్యాసంస్థల అధినేత వరప్రసాద్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అంబటి రాంబాబు సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. తనకు సత్తెనపల్లి నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తాను నియోజకవర్గంలో కాలుపెడితే చంపేస్తామంటూ ఎవరో ఫోన్ చేస్తున్నారని అంబటి పోలీస్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. నాలుగు స్థానాలలో ఇద్దరేసి కొఆర్డినేటర్లను నియమించింది వైఎస్సార్సీపీ అధిష్ఠానం.

google-ad-img
    Related Sigment News
    • Loading...