ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్  విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు  చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశిస్తూ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu