ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి కూడా బీఫ్ గురించి మాట్లాడేశాడు

ఇప్పుడు ఎక్కడ చూసినా దేశంలో గోమాంసం గురించి మాట్లాడేవాళ్లే ఎక్కువైపోయారు. సామాన్యుడు దగ్గరనుండి అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి వరకూ దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఆజాబితాలో ఇన్ఫోసిన్ సంస్థ అధినేత నారాయణ మూర్తి కూడా బీఫ్ వివాదం గురించి మాట్లాడేశాడు. ఈ మధ్య ఆయన ఇచ్చిన ఇంటర్య్వూలో దేశంలో మైనార్టీలకు రక్షణ  లేదని.. వారిలో భయాందోళనలు ఉన్నాయంటూ గోమాంసం వివాదం గురించి చెప్పకనే చెప్పారు. అంతేకాదు మతాలు, ప్రాంతాల మధ్య సామరస్యం ఉండాలని.. దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈసమస్యకు వెంటనే పరిష్కారం ఆలోచించాలని వ్యాఖ్యానించారు. నారాయణ మూర్తి చేసిన సూచనలు బానే ఉన్నా.. హాయిగా సాఫ్ట్ వేర్లు.. సేవా కార్యక్రమాలు చూసుకోక ఆయనకు ఇవన్నీ ఎందుకు అని విమర్శిస్తున్నారు.