"బ్రిక్స్'' సమావేశానికి చేరుకున్న మన్మోహన్ సింగ్

posted on: Mar 26, 2013 2:48PM

Indian Prime Minister Attending BRICKS Conference, BRICKS Conference Indian Prime Minister Attending, Manmohan Singh Attending BRICKS Conference,

 

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)సదస్సు దక్షిణాఫ్రికాలో తొలిసారిగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, మంత్రులు చిదంబరం, ఆనంద్ శర్మ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ లు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కు చేరుకున్నారు.  భారత ప్రధాని తన నాలుగు రోజుల పర్యటనలో చైనా కొత్త అధ్యక్షుడు జీ.జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత, చైనా మధ్య సంబంధాలు పటిష్టంగా ఉంచడంపై చర్చిస్తామని తెలిపారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ బ్రిక్స్ దేశాల్లో మౌలిక సదుపాయాలూ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి సద్దాస్సులో ప్రకటన చేసే అవకాశముందని, ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పునరుద్దరణ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంస్థలను, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలను సంస్కరించే మార్గాలపై చర్చిస్తామని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...