భారత రక్షణ రంగంలో మరో యాంటి సబ్ మెరైన్ యుద్ధ నౌక

posted on: Oct 6, 2025 8:38PM

 

భారత రక్షణ రంగంలో మరో శక్తివంతమైన యుద్ధనౌక చేరింది.  80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యద్ద నౌక శత్రు దేశాల సబ్ మెరైన్లను సమర్ధవంతంగా ఎదుర్కోగల సాంకేతిక సామర్థ్యంతో రూపొందించారు . వార్ ఫేర్ సబ్మెరైన్ హంటర్ వాటర్ క్రాఫ్ట్ సిరీస్ రెండు  తరహా కు చెందిన ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనే ఈ యుద్ధ నౌకను తూర్పు నౌకాదళ  కేంద్రం విశాఖలో ప్రారంభించడం జరిగింది.

తూర్పునౌకదల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్దర్కర్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 77 మీటర్ల పొడవు 1500  బరువుతో రూపొందించిన ఈ యాంటి సబ్మెరైన్ షిప్ కు లక్షద్వీప్ లోని ఒక ఐలాండ్ పేరు ఆండ్రోత్ గా పెట్టారు. ఈ యుద్ధనౌక జల ప్రవేశంతో తూర్పు తీరంతో పాటు భారత రక్షణ రంగం మరింత సమర్థవంతంగా మారినట్టు అయింది

google-ad-img
    Related Sigment News
    • Loading...