Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2047 నాటికి ఇండియా సూపర్ పవర్.. ఏ శక్తీ అడ్డుకోలేదు.. చంద్రబాబు
posted on: Dec 26, 2025 1:46PM
.webp)
భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం ( డిసెంబర్ 29) వరకూ తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబిబు ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రస్తుతించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్న ఆయన ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు.
భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్న అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలు 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు.రెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేదనీ, నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదనీ వివరించారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇండియా చాంపియన్ అన్నారు.
ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతుని చెప్పిన చంద్రబాబు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని పురోగమిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.






