ధర్మశాలలో రాహుల్ అర్థశతకం..అవుట్

posted on: Mar 26, 2017 1:35PM

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడుతున్నారు. భోజన విరామం తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్ వేగం పెంచాడు..ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 99 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 51 పరుగులు నమోదు చేశాడు..అనంతరం 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుమ్మిన్స్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు..ప్రస్తుతం పుజారా 42, రహానే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...