ఇండియాలో ఐకమత్యం లేకపోవడం వల్లే ఓటమి : ఒమర్ అబ్దుల్లా
Published on: Sat Feb 8, 2025 12:43PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత గొడవపడి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. . ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇండియా కూటమిలో ఆప్ , కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ అధికార దాహంతో రెండు పార్టీలు ఒకరినొకరు ఓడించుకున్నాయన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలో విభేదాలు నెలకొన్నాయి. కూటమిలో ఐకమత్యం లేకపోవడం బీజేపీకి ప్రయోజనం చేకూరుంది అని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.


