ఫారిన్ పాలసీ చెప్పింది నిజమేనా..? ఇండియాలో అణు పరీక్షలు..?

మన దేశంలో ఏం జరుగుతుందో మనకే తెలియని ఓ సంచలనమై విషయాన్ని ఓ అంతర్జాతీయ పత్రిక ఒకటి భయటపెట్టింది. అదేంటంటే.. ఇండియా రహస్యంగా అణుపరిశోధనలు చేయడం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం అంటుంది అంతర్జాతీయ పత్రిక. పాకిస్థాన్ అస్థిరపరచేందుకు కోసం భారత్ అత్యంత రహస్యంగా అణుకార్యక్రమం సాగిస్తోందని.. కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని ఛెల్లకెరిలోని గిరిజన ప్రాంతంలో ఈ అణు పరిశోధనలు సాగుతున్నాయి 'ఫారిన్ పాలసీ'' అనే అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఇది సంచలనమైంది. ఇప్పుడు ఈ విషయం పై ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందునా.. పాకిస్థాన్ కంటే ముందు అణు పరిశోధనల గురించి ఏ చిన్న విషయమైన చిటికెలో పసిగట్టే అమెరికా కూడా ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఈ విషయంపై మన దేశం ఏం చెపుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu