Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ చేరిన భారత్
posted on: Feb 27, 2020 1:00PM

మహిళల టీ20 వరల్డ్కప్లో టీమిండియా అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్కి అర్హత సాధించింది. మెల్బోర్న్లో న్యూజిలాండ్తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీస్కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 129 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 46 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.






