టీమిండియా.. 87 పరుగులు చేస్తే చాలు...

 

ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ధర్మశాల వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ఈరోజు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్  137 పరుగులకే ఆలౌట్ అయి టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లు ఆడి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా మరో 87 పరుగులు చేస్తే సిరీస్ భారత్ కు దక్కినట్టే.