లీడ్ లో టీమిండియా... పెవీలియన్ దారి పట్టిన ఆటగాళ్లు..

posted on: Mar 27, 2017 11:41AM

 

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో  భాగంగా భారత్‌ 248/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో చేసిన స్కోరును అలా దాటామో లేదో... ఇలా ఒక్కొక్కరూ పెవీలియన్ దారి పట్టారు. జట్టు స్కోరు 300 పరుగులు దాటగానే, 317 పరుగుల వద్ద జడేజా, 318 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహాలు అవుట్ అయ్యారు.  ప్రస్తుతం భారత స్కోరు 115 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు కాగా, లీడ్ 25 పరుగులుగా ఉంది. ప్రస్తుతం ఉమేష్ యాదవ్, కుల్ దీప్ లు ఆడుతున్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...