ఇండియా టార్గెట్ 351
posted on: Oct 30, 2013 5:27PM

ఇండియాతో జరుగుతున్న ఆరో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దీగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 350/6 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లను త్వరగా కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆతరువాత వాట్సన్, కెప్టెన్ బెయిలీ సెంచరీలతో వీర విహారం చేశారు. కెప్టెన్ బెయిలీ156 (114బంతుల్లో13ఫోర్లు6 సిక్సర్లు), వాట్సన్102 (94బంతుల్లో13ఫోర్లు3సిక్సర్లు) చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది. వోజేస్ 44 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఇండియా బౌలర్లలో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా..భువనేశ్వర్, షామి ఒక వికెట్ తీశారు.



.jpg)
.jpg)


