'ఇద్దరమ్మాయిలతో' సెన్సార్ రిపోర్ట్ న్యూస్
posted on: May 24, 2013 4:01PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా సంగీతం సూపర్ హిట్ కావడంతో, మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ రోజే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా...ఐపీఎల్ ఫీవర్ కారణంగా సినిమాను వచ్చే వారానికి వాయిదా వేసారు. బన్నీ సరసన కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.






