తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

posted on: Aug 3, 2024 12:52PM

తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్.ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది.
* ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా వున్న టి.కె. శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా బదిలీ చేశారు.
* వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
* డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీష్‌కి రవాణా, ఆర్ అండ్ బి సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
* మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కి అదనపు బాధ్యతలు కేటాయించారు.
* పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంకని నియమించారు.
* హాకా మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.
• మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.
• రవాణా, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్ బదిలీ అయ్యారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...