హైదరాబాద్లో టెక్కీ దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి

posted on: May 25, 2016 10:28AM

 

హైదరాబాద్లో రోజు రోజుకు టెక్కీల హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి హష్మీ ఒక రోజు క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మీని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సెల్‌ఫోన్‌, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...