పెళ్లి ముసుగులో మోసం... అమ్మాయిలూ జర జాగ్రత్త.. సీపీ సజ్జనార్

posted on: Feb 23, 2026 10:24AM

పెళ్లి ముసుగులో ప్రమాదం పొంచి ఉందంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ అమ్మాయిలను హెచ్చరించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన పోస్టులో ఆయన..   కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబం ధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు  వస్తున్నాయని పేర్కొన్నారు. 

పెళ్లి పేరుతో జరుగుతున్న మోసం గురించి ఆయన తన పోస్టులో సవివరంగా తెలియజేశారు.   సంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాత.. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరై.. ఆ తరువాత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, అక్కడ నుంచి  పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని  లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడు తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్  పేర్కొన్నారు.

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధు మిత్రులందరికీ తెలిసిపో వడంతో..   పెళ్లి ఆగిపోతే సమాజంలో  పరువు   పోతుందన్న భయంతో చాలా మంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారనీ.. ఈ బలహీనతనే ఆయుధంగా భావిస్తున్న మోసగాళ్లు రెచ్చిపోతున్నారనీ ఆయన హెచ్చరించారు.    పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అను భవించాల్సి వస్తుందని పేర్కొన్న ఆయన నిశ్చితార్థం అయినా సరే..  పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు.

పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ముందుగా అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలనీ, అలాగే  పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని పేర్కొన్నారు.   డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దనీ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సజ్జనార్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనీ,  ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు లేదా 100 కు  కాల్ చేయండి అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...