హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

posted on: Jul 3, 2025 5:23PM

 

హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్, పాశమైలారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమానుల నిర్లక్ష్యం జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...