హుస్సేన్ సాగర్ శుభ్రం చేయోచ్చు... ఆస్ట్రియా నిపుణులు

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హైదరాబాద్ కు వచ్చి ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయి, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై చర్చించారు. అనంతరం వారు హుస్సేన్ సాగర్ ను పరిశీలించి డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్‌సాగర్ కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని సూచించారు. సైంటిస్టుల బృందం దీనికి సంబంధించిన నివేదికను మంగళవారం సీఎం కేసీఆర్‌కు సమర్పించనుంది.