మొగుళ్ళే యముళ్లు

 

కట్టుకున్న భర్తలే భార్యలను అతి కిరాతంగా చంపుతున్నారు. మొగుళ్లే యముళ్లులాగా తయారయ్యారు. గొడవేదైనా కాని చంపడమే పరిష్కారంగా ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ భర్త తన ఇల్లాలితో గొడవ పడి గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఇప్పుడు అదే తరహాలో శుక్రవారం మరో రెండు దారుణాలు జరిగాయి. గుడిబండ జిల్లాలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తరువాత తను కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇదిలా ఉండగా లక్కవరపుకోటలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గోల్డ్‌స్పాట్‌ కంపెనీ కూడలి దగ్గర ఓ గర్భిణి దారుణహత్యకు గురైంది. భర్తే తన భార్యకు నిప్పంటించి చంపేశాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu