నేపాల్ ను పట్టుకున్నమరో భూతం

posted on: May 4, 2015 12:36PM

 

అసలే భూకంపం వల్ల నేపాల్ కు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ నేపాల్ ప్రజలు భయపడుతూనే ఉన్నారు. అటూ భూకంపంతో పాటు మరో భూతం నేపాల్ ను వణికిస్తోంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమరవాణా). అసలే హ్యూమాన్ ట్రాఫికింగ్ కు నేపాల్ దేశం పెట్టింది పేరుగా తయారైంది. ఇప్పుడు ఈ దేశంలోని మహిళల అక్రమ రవాణా మరింత పెరగే అవకాశం ఉందని సమాచారం. భూకంపం వల్ల ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ట్రాఫికర్స్ రెచ్చిపోవచ్చనే అనుమానాలు వణికిస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, వారు ప్రయాణికుల వివరాలు, వీసా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, ముఖ్యంగా పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై శ్రద్ధ పెట్టామని అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని, దీనికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేశామని, ముఖ్యంగా రోడ్డు మార్గం, టాక్సీ బూత్, టాక్సీ యూనియన్లపై ఓ కన్నేసి ఉంచామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...