తెలంగాణ హోంమంత్రి చంద్రబాబును బెదిరిస్తున్నారా?

posted on: Nov 30, 2015 11:42AM

 

తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్లాన్ పైనే చంద్రబాబు మూడు నెలల తర్వాత  హైదరాబాద్ వచ్చారని, బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయనకు ధన్యవాదాలు చెబుతామని అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు పెండింగులోనే వున్నదని, ఏమి చేయాలో తమకు తెలుసునని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం చట్టం విషయంలో జోక్యం చేసుకోదని చెప్పారు. నాయిని సడన్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? గ్రేటర్ ఎన్నికల కోసం ముందుగానే బాబుని హెచ్చరిస్తున్నారా? అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...