Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హెచ్ఎంపీవీ వైరస్.. మళ్లీ భయపెడుతున్న వైరస్ దాడులు.. ఇది ఎవరికి ఎక్కువ ప్రమాదం తెలుసా?
posted on: Jan 7, 2025 9:30AM

హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ ఇన్ఫెక్షన్ చైనా నుండి మొదలైంది. ఇది కొత్తగా పుట్టినదేమీ కాదట. ఇది ఆరు దశాబ్దాల నుండి ఉనికిలో ఉంది. శాస్త్రవేత్తలకు గత 25 సంవత్సరాలుగా దీని గురించి తెలుసు. ఇది ఆర్ఎన్ఏ వైరస్. అందుకే ఇది సజీవంగా ఉండటానికి సహజంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం హెచ్ఎంపీవీలో కొత్త మ్యుటేషన్ కూడా సంభవించింది. దీని కారణంగా చైనాలో కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీడియా నివేదికలు, వీడియోలు చైనాలోని ఆసుపత్రులు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో జనాలను తరలించడం చూపించాయి. ఈ వార్తలు చూస్తుంటే చైనా నుండి మరో అంటువ్యాధి కరోనా మాదిరిగా ప్రపంచమంతటా వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ప్రజలు ఇంకా కరోనా నుండి సరిగ్గా కోలుకోలేదు. కానీ అప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇది ప్రజలను కలవరపెడుతోంది. అన్నింటిలో మొదటిది దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా ఆసుపత్రులు, శ్మశానవాటికలలో రద్దీని పెంచిందని చైనా నుండి వార్తలు వచ్చాయి. పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. చైనా తర్వాత ఇతర దేశాలలో కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది. సోమవారం (డిసెంబర్ 6), ఈ అంటు వ్యాధి మొదటి కేసు భారత్ లో కూడా నమోదైంది
ఈ వైరస్ గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కరోనా వైరస్తో సమానంగా ఉంటుందట. దాని లక్షణాలు కరోనా కంటే కొంచెం ఎక్కువ లేదా కరోనా కంటే కొంచెం తక్కువ తీవ్రతతో ఉంటాయట. కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ప్రజలు జలుబు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారట.
*రూపశ్రీ.






