అసోం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

posted on: May 12, 2026 6:40PM

 

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,  ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా ముచ్చటించారు.

అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అస్సాం సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన శర్మ ప్రమాణం చేస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిమంతతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి రామేశ్వర్ తేలి, అసోం గణ పరిషత్ అధ్యక్షుడు  అతుల్ బోరా, యూపీపీఎల్ నేత చరణ్ బోరో, సీనియర్ బీజేపీ నేత అజంత నియోగ్  ఉన్నారు.

హిమంత బిశ్వ శర్మ తొలిసారిగా 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ-ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా హిమంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...