హైకోర్టు ఆగ్రహం..నేడు కోర్టుకు డీజీపీ

posted on: Dec 5, 2018 11:36AM

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న పిటిషన్ పై విచారణ జరగ్గా హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ నేటికి వాయిదా వేసింది. తాజాగా ఈ రోజు మరో మారు  ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకే అరెస్ట్‌ చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. దీనిపై డీజీపీనే నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో డీజీపీ నిమగ్నమై ఉన్నారని ఏజీ సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందని కోర్టు.. డీజీపీ వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన నేరుగా కోర్టుకు సమాధానం ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది. ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌‌ను అరెస్ట్ చేశారనే దానిపై నివేదికను అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...