Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరిపూర్ణ విజయం
posted on: Sep 27, 2012 8:13AM
.png)
అక్రమంగా క్వారీయింగ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే చారిత్రక ప్రాశస్త్యం ఉన్న వకుళమాత గుడి మళ్లీ కట్టాలని కూడా ఆదేశించింది. హైకోర్టు స్పందించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ సాంస్కృతి ప్రాభవానికి తిరుమల నిదర్శనమని, అటువంటి తిరుమల రాయుడు, శ్రీనివాసుడు తల్లి వకుళమాత గుడి జీర్ణా(దురా)వస్థకు చేరటానికి కారణాలు పరిశీలించాలని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఇటీవల కోరారు. అంతేకాకుండా ఆయన ఆందోళన కూడా చేపట్టారు. మతభ్రష్టత్వానికి దారితీస్తున్న ఈ పరిస్థితులపై ఆయన ఆగ్రహంతోనే అప్పటి చికాగో సభలో వివేకానందున్ని జ్ఞాపకం చేసుకుని స్వామిజీ కాకినాడలో ఓ పెద్ద బహిరంగసభ కూడా నిర్వహించారు. హైందవజాతికి దిశానిర్దేశం చేసేందుకు ఆయన తన వంతు పాత్రను పోషించారు. ఈ సమయంలో హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ముఖ్యంగా స్వామిజీకి, హైందవ సంస్కృతిని నమ్ముకున్న వారికి ఊరటను ఇచ్చింది. అసలు ఆలయం పరిసరాల్లో క్వారీయింగ్ను పరిపూర్ణానంద సరస్వతి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఆయన తరువాత మరికొందరు ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం ఉన్న పరిసరాల్లో మైనింగ్ కార్యకలాపాలను ఆపేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్వారీలపైనే ఆధారపడిన పేదల పరిస్థితిని కూడా హైకోర్టు దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యామ్నాయ ఉపాథి చూపించాలని దిశానిర్దేశం కూడా చేసింది. ఈ తీర్పు గురించి విన్న పలు ప్రాంతాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


.png)
.png)


