ఆర్టీసీ కార్మికులకు డెడ్లైన్

posted on: May 12, 2015 1:12PM

 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మండిపడింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు సమ్మెవిరమించాలని హైకోర్టు డెడ్లైన్ విధించింది. సమ్మె విరమించకుండా కార్మిక సంఘాలు ఇదే మొండి వైఖరి కొనసాగిస్తే ఊరుకోమని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్ర రాష్టాలకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు, ఆర్టీసీ అధికారులు కూడా ఈ సమస్యపై ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకొని, సమ్మె విరమణ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...