TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హీరో శ్రీహరి ప్రథమ వర్ధంతి

Published on: Thu Oct 9, 2014 6:31PM

 

ప్రముఖ కథానాయకుడు దివంగత శ్రీహరి ప్రథమ వర్ధంతి గురువారం నాడు ఆయన స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, వీర శంకర్, దేవీ ప్రసాద్, బాబీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి మాట్లాడుతూ, ‘‘మా బావ శ్రీహరికి నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై ఈ కార్యక్రమాన్ని మా పిల్లలు శశాంక్, మేఘాంశ్ కొనసాగిస్తారు. మా పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో వుండాలని నేను ఆశపడ్డాను. వాళ్ళు సినిమా రంగంలోనే వుంటామని చెబుతున్నారు. వారికి సినిమా పరిశ్రమ అండగా వుంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. శ్రీహరి కుమారులు శశాంక్, మేఘాంశ్ మాట్లాడారు. దర్శకుడు కావాలన్న కోరికను శశాంక్, హీరో కావాలన్న కోరికను మేఘాంశ్ వ్యక్తం చేశారు.