భానుడి భగభగ... ఐఎండీ రెడ్ అలర్ట్
posted on May 23, 2015 11:41AM

గత రెండురోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కవైంది. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తెలంగాణ రాష్ట్రంలో 223 మంది, ఆంధ్ర రాష్ట్రంలో 204 మంది మొత్తం రెండు రాష్ట్రాలల్లో కలిపి 427 మంది మరణించారు. హైదరాబాద్ లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గత ఐదేళ్లలో ఇదే అత్యధికం అని అధికారులు తెలిపారు. కాగా వడదెబ్బ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ.50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.