రీలీజ్ కు ముందే పూరీ సక్సెస్

posted on: Jan 27, 2014 9:15AM

 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్, ఆదాశర్మ జంటగా నటించిన "హార్ట్ ఎటాక్" చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తుంది. దాదాపు 23కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్ర బిజినెస్ అప్పుడే 20కోట్లు రాబట్టినట్లుగా తెలిసింది. ఈ చిత్రం హక్కుల్ని నైజాంకి 6 కోట్లకి, సీడెడ్‌కి 2 కోట్లకి, ఆంధ్రాకి 8 కోట్లకు అమ్మారని, అదే విధంగా శాటిలైట్ హక్కులు 4 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ దాదాపు వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు. పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్లో పూరి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాబట్టి నిర్మాతగా విజయం సాధించినట్లే. కానీ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...