Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొండాసురేఖపై పరువు నష్టం కేసు నవంబర్ 13కి వాయిదా
posted on: Oct 30, 2024 10:42AM
మంత్రి కొండాసురేఖపై పరువు నష్టం దావావేసిన నేపథ్యంలో బుధవారం(అక్టోబర్ 30) నాంపల్లి కోర్టులో విచారణకు రాలేదు.అయితే కెటీఆర్ తన వద్ద ఉన్న ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ కేసు నవంబర్ 13కి వాయిదా పడింది. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదాపడింది. నాగార్జున కుటుంబంపై కొండాసురేఖ స్టేట్ మెంట్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉందని మాజీ మంత్రి కెటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన నాంపల్లి కోర్టు కెటీఆర్ తో బాటు బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ రికార్డు చేసింది . మిగతా సాక్ష్యుల స్టేట్ మెంట్ ను కోర్టు ఇవ్వాళ రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి 23 ఆధారాలను కెటీఆర్ న్యాయస్థానానికి సమర్పించారు. కొండాసురేఖ కూడా తన వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఆమె స్టేట్ మెంట్ కోర్టు రికార్డు చేసింది.



.webp)


