Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
posted on: May 18, 2025 12:23PM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అంతకుముందు టీటీడీ నిబంధనల ప్రకారం ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలు జరిపి లడ్డూ ప్రసాదం అందజేశారు. శ్రీవారి దర్శనంతరం ప్రముఖులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖులు తెలిపారు.కాగా తిరుమల శ్రీవారిని దర్శించునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వెంకన్న సేవలో పాల్గొంటున్నారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వారి సౌకర్యార్థ్యం అధికారులు అన్ని ఏర్పాట్లు శారు.



.webp)


