Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫలించిన వ్యూహం.. బీజేపీదే విజయం.
posted on: Aug 9, 2018 12:08PM

గత కొద్ది రోజులుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి చర్చ జరుగుతుంది.. అధికార పక్షం, విపక్షాలు గెలుపు మాది అంటే మాది అంటూ ధీమాగా చెప్పాయి.. కానీ అధికార పక్షాన్నే విజయం వరించింది.. బీజేపీ వ్యూహం ఫలించి వారు ఊహించిందే జరిగింది.. తమ పార్టీ అభ్యర్థిని నిలబెడితే తటస్థ పార్టీలు వ్యతిరేకించే ప్రమాదం ఉందని గ్రహించిన బీజేపీ.. మిత్రపక్షం నుండి అభ్యర్థిని నిలబెట్టింది.. అనుకున్నట్టే విజయం సాధించింది.. ఎన్డీయే తరుపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ బరిలోకి దిగగా, విపక్షాలు తరుపున కాంగ్రెస్ ఎంపీ కే హరిప్రసాద్ బరిలోకి దిగారు.. హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, హరివంశ్ నారాయణ్ 125 ఓట్లతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.




