బురదలో కూరుకుపోయిన హరీష్‌రావు

 

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బురదలో కూరుకుపోయారు. ఎలాగంటారా... తెలంగాణ లో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పూడికలు తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్‌రావు మెదక్ జిల్లా నంగనూర్ మండంలోని ఎర్రచెరువు వద్ద చేస్తున్న పనులను పర్యవేక్షించడానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ప్రొక్లేన్ పూడిక తీస్తున్న బురదలో కూరుకుపోయారు. దీంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమై డ్రైవర్ ను హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది బురదలో కూరుకుపోయిన మంత్రిగారిని బయటకు లాగారు.