Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హోంమంత్రి బంధువంటూ లై*గిక దాడి!
posted on: Mar 23, 2021 12:58PM
ఏపీ హోంమంత్రి సుచరిత బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్స్ చేస్తానంటూ నమ్మించాడు. భర్తతో గొడవ పడిన ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఓ ఇంట్లో ఉంచి ఆమెపై లై*గిక దాడి చేశాడు. అతనితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడూ జత కలిశాడు. మహిళ న..గ్న వీడియోలు తీశారు. కేసు పెడితే పోలీసులూ పట్టించుకోవడం లేదు. ఇదంతా ఓ బాధితురాలి ఆరోపణ. తనకు న్యాయం చేయమంటూ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది ఆ మహిళ.
నరసరావుపేటలోని శ్రీనివాసనగర్కు చెందిన ఓ యువతి భర్తతో గొడవ పడి విడిపోయింది. ఆ మేటర్ సెటిల్ చేస్తామంటూ నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావు ఆమెను నమ్మించారు. ఆ మహిళ దగ్గర ఉన్న 47 సవర్ల బంగారు ఆభరణాలు కాజేశారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేసేందుకు నరసరావుపేట టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లింది ఆ మహిళ. అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి తాను హోంమంత్రి సుచరిత బంధువంటూ పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడు లై*గిక దాడి చేశారు. అనంతరం న..గ్న వీడియోలు తీసి ఆమెను బెదిరించారు. రూరల్ ఎస్ఐ డబ్బులు తీసుకుని ఆమెకు అన్యాయం చేయటమేకాక కాంగ్రెస్ నాయకుడిపై కేసు పెట్టకుండా వదిలేశారు. వారిద్దరిపై తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు.



.jpg)


