జగన్ దీక్షకు కౌంటర్ గా టీడీపీ ర్యాలీలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు కౌంటర్ గా టీడీపీ నేతలు జగన్ వ్యతిరేక ర్యాలీలు చేపట్టారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో కౌంటర్ ర్యాలీ చేపట్టారు, పాలకొల్లు నుంచి నరసాపురం వరకూ సాగిన ఈ ర్యాలీలో పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు, జగన్ ముందు తన అక్రమ ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, ఆ తర్వాతే దీక్ష చేపట్టాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు