Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాచర్లలో కన్నా, రాయపాటి పోటాపోటీ
posted on: Mar 12, 2012 2:00PM
గుంటూరు: గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావుల మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. పోటీపడే విషయంలో వీరిద్దరూ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ఇప్పుడు వీరి పోటా పోటీకి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వేదిక అయింది. ఈ నియోజకవర్గంలో తన సన్నిహితుడు గండ్రకోట రాంబాబుకు టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్యా మరోసారి పోటీ ప్రారంభమైంది. ఇద్దరు నాయకులు కాంగ్రెస్ టిక్కెట్ ను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయడానికి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కర్రి పున్నారావులు కూడా ప్రయత్నిస్తున్నారు. కన్నా, రాయపాటి ఎవరికీ వారు ఒకవైపు తమ ప్రయత్నాలు చేసుకుంటుండగా ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పటివరకు మాచర్ల విషయంపై తమ మనోగతాన్ని అధిష్టానికి వెల్లడించకపోవడం విశేషం.






