నిండు గర్భిణి గిన్నిస్ రికార్డ్

 

నిండు గర్భిణి 5కె రన్ లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించింది. కరీంనగర్ కు చెందిన కామారపు లక్ష్మీ అనే ఆమె మిషన్ కాకతీయకు మద్దతివ్వాలన్న సంకల్పంతో ఇంతటి సాహసానికి పూనుకుంది. రేపో మాపో డెలివరీ కూడా అవుతుంది, అయినా లెక్కచేయకుండా స్ఠానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 5కె రన్ లో పాల్గొంది. ఉదయం 6 గంటలకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి టీవీఎల్ సత్యవాణి 5కె రన్ ను ప్రారంభించారు. లక్ష్మీ 5 కిలోమీటర్ల దూరం ఆగకుండా పరిగెట్టి కేవలం 30 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ ఎం విజయభాస్కర్ రావు, ఉత్తర తెలంగాణ ప్రతినిధి యెడల్ల రమేశ్ ఈ రికార్డును నమోదు చేశారు.