మీడియానే సమస్యలు సృష్టిస్తోంది.. నరసింహన్

 

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.. కానీ త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనవసరంగా మీడియానే మరీ ఎక్కువగా చూపిస్తుందని.. రెండు రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కాగా గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu