గవర్నర్ విందుకి కేసీఆర్ డుమ్మా?
Published on: Tue Jun 30, 2015 9:03PM
.jpg)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేసారు. దానికి ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఇరు రాష్ట్రాల శాసనసభాపతులను, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ విదుకు హాజరయ్యారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి జ్వరంతో బాధపడుతున్నందున ఈ విందుకు హాజరు కాలేకపోయారు. ఈ విందులో రాష్ట్రపతి మరియు గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రులిరువురూ ఎదురుపడినప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తారో చూద్దామని ఆశపడిన వాళ్ళందరూ చాలా నిరాశ చెందారు.


