బాబోయ్ గోదావరి

 

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుతూ వుండటంతో లంకల్లో పంటలు పండిస్తున్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కష్టపడి పండించిన పంట చేతికి అందుతుందో లేదో అని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లంకల్లోకి నీరు వచ్చి చేరుతూ వుండటంతో గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా నష్టపోతామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu