తండ్రిని కొట్టి అమ్మాయిపై అఘాయిత్యం

ఒంటరిగా ఉండే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగే రోజులు పోయాయి. ఇప్పుడు తోడుగా ఉన్నా వాళ్లని కొట్టి మరీ అమ్మాయిల మీద అత్యాచారాలు చేసే రోజులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బారువాడలో ఇలాంటి ఘటనే జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలిక, తన తండ్రి ఇద్దరూ కలిసి ఆటోలో కలిసి వెళుతూ మంచినీటి కోసం ఆగారు. అయితే తండ్రి మంచినీటి కోసం క్రిందకు దిగగా ఐదుగురు దుండగులు వచ్చి ఆమెను బలవంతంగా ఆటోలో ఎత్తికెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన ఆ బాలిక తండ్రిని బండరాయితో కొట్టి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఐదుగురు నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.