బీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ హోర్డింగ్స్ హడావుడి


బీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరి నెలఖారు లోపు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడే టీఆర్ఎస్ పార్టీ హడావుడి మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగులు అప్పుడే దర్శమిస్తున్నాయి. సాధారణంగా ప్రచారంలో హోర్డింగులు ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలు, మొదలు రాజకీయ పార్టీల వరకు హోర్డింగ్స్ లో ప్రచారానికి తెగ ఆసక్తి చూపిస్తుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడే తమ పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగులతో పబ్లిసిటీ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఅర్ ఫోటోలతో హోర్డింగులు పెట్టారు. ఇప్పుడే ఇంత పబ్లిసీటీ మొతలైతే.. ఇక ముందు ముందు ఇంకెన్నీ హోర్డింగ్స్ దర్శనమిస్తాయే అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఎలాగు హోర్డింగ్స్ పై అధికారం జీహెచ్ఎంసీ అధికారుల పరిధిలో ఉంటుంది కాబట్టి.. ఎక్కువ శాతం హోర్డింగ్స్ గులాబీ మయంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విశషం ఏంటంటే.. ఈ హోర్డింగ్స్ కోసం నేతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకడుగు వేయకపోవడం. మరి ఈ హోర్డింగ్స్ ఎన్నికల విజయానికి ఎంత వరకూ ఉపయోగపడతాయో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.