రాష్ట్రంలో రెండోదశ.. కేంద్రంలో 8వ దశ పోలింగ్ రేపే..

 

సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు సహా దేశవ్యాప్తంగా 64 లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సీమాంధ్ర (25), ఉత్తరప్రదేశ్ (15), బీహార్ (7), హిమాచల్ ప్రదేశ్ (4), జమ్ము కాశ్మీర్ (2), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బెంగాల్ (6)లలో బుధవారం 8వ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్థానాల్లో సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇప్పటి వరకు 7 దశల్లో 438 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సుమారు 66.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొమ్మిదవ, చివరిదశ పోలింగ్ ఈనెల 12న జరుగుతుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది.మే 16వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది.