అరకు కిడ్నాప్ వెనక గంజాయి ముఠా
posted on: Dec 5, 2024 12:44PM
తీగ లాగితే డొంక కదిలింది. అరకుకు చెందిన బాలుడి కిడ్నాప్ వెనక గంజాయి ముఠా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అరకుకు చెందిన ప్రకాశ్, సుశీల్ కుమార్ పల్నాడుకు చెందిన యాసిన్ , సంతోష్ మద్య గంజాయి డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం ప్రకాశ్ సుశీల్ కుమార్ లు గంజాయి సప్లయ్ చేయాలి 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా యాసిన్, సంతోష్ చెల్లించారు. అయినప్పటికీ ప్రకాశ్ , సుశీల్ కుమార్ లు ఎంతకూ గంజాయి సప్లయ్ చేయకపోవడంతో ప్రకాశ్ బంధువుల అబ్బాయిని యాసిన్, సంతోష్ కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని కిడ్నాప్ నుంచి విముక్తి కల్పించి ప్రకాశ్, సుశీల్ కుమార్ లను అరెస్ట్ చేశారు.


.webp)
.webp)


