చేతులు జోడించి అడుగుతున్నా.. ప్రత్యేక హోదాపై గల్లా

 

ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్ సిన్హా ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సిన్హా ఇచ్చిన సమాధానంతో మాకు చాలా బాధ కలిగింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని అన్నారు. పార్లమెంట్ లోపలా.. ఎన్నికల ససమయంలో మోడీ హామీలు ఇచ్చారు.. మోడీ ఇచ్చిన హామీకే సభలో విలువలేదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ కు ఏ సిఫార్స్ మీద ప్రత్యేక హోదా ఇచ్చారు..? బుందేల్ ఖండ్.. తలసరి ఆదాయం కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువగానే ఉంది.. ఏపీకి ప్రత్యేక  హోదా ఇవ్వాలని చేతులు జోడించి అడుగుతున్నా.. ఇప్పటి వరకూ ఏపీకి ఏమిచ్చారు.. ఏం ఇవ్వబోతున్నారు.. ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇక మాటలు వినే ఓపిక ప్రజలకు లేదు, చేతలు కావాలని ఆయన స్పష్టం చేశారు.