Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీకే ఓటేశాను... అయినా వేధిస్తున్నారు
posted on: Oct 26, 2015 4:29PM

ఏపీ రాజధాని అమరావతికి భూమి ఇవ్వలేదని తన ఐదెకరాల పొలంలో చెరుకు పంటను తగలబెట్టారని గుంటూరు జిల్లా మల్కాపురానికి చెందిన రైతు గద్దె చంద్రశేఖర్ వాపోయాడు, తనను పరామర్శించడానికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన గద్దె చంద్రశేఖర్... రాజధానికి పొలం ఇవ్వనందుకు పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, నా పొలంలో నేను షామియానాలు, కుర్చీలు వేసుకుంటే.... కానిస్టేబుళ్లు వచ్చి బలవంతంగా జీపులో ఎక్కించుకుని వేధించారని మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్ వాపోయారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించినందుకే తనపై కక్షగట్టి పోలీసులను ప్రయోగిస్తున్నారని, తాను టీడీపీకే ఓటు వేశానని, అయినా ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు, జగన్ పార్టీకి తాను ఓటు వేయలేదని, అయినా నన్ను పరామర్శించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.






