సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. ఈ ఉచిత వైఫై సౌకర్యం ద్వారా మొదటి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవలను మరింత విస్తరింపజేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంగా మారుస్తామని అన్నారు. ఈ ఉచిత వైఫై సేవలను మరి కొన్ని రైల్యేస్టేషన్ లకు విస్తరింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పికె. శ్రీవాత్సవ పాల్గొన్నారు.